Friday, May 9, 2025
Homeతెలంగాణ వార్తలుకోటగిరి లో బైక్ ను దగ్ధం చేసిన దుండగులు

కోటగిరి లో బైక్ ను దగ్ధం చేసిన దుండగులు

అస్త్రం/ కోటగిరి: ఇంటి ఎదుట పార్క్ చేసిన హోండా షైన్ 100 సీసీ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చెసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన పోతురాజు శ్రీనివాస్ అనే యువకుడు రోజు మాదిరి గానే యధావిధిగా ఇంటి ఇంటి ఎదుట తన బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు బాధితుడు ఆరోపించారు. అగ్ని జ్వాలలు రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసే సరికి పెద్ద పెద్ద మంటలతో బైక్ పూర్తిగా దగ్ధమైందని బాధితుడు తెలిపాడు. బాధితుడు కోటగిరి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments