Monday, May 12, 2025
Homeతెలంగాణ వార్తలుకల్తీ కల్లు నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి - నార్కోటెక్ డీసీపీ రమేష్

కల్తీ కల్లు నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి – నార్కోటెక్ డీసీపీ రమేష్

అస్త్రం/రుద్రూర్ : గ్రామీణ ప్రాంతాల్లో ని నిరక్షరాస్యులు, అమాయక ప్రజలు కల్తీ కల్లుకు, మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నార్కోటెక్ డీసీపీ రమేష్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య అదేశాను సారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మాదక ద్రవ్యాల నివారణ పై రుద్రూర్ మండల కేంద్రం లో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నేటి సమాజంలో నిరక్షరాస్యుల తో పాటు యువత సైతం మాదక ద్రవ్యాలను బానిసలై జీవితాలను గుల్ల చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కల్తీ కల్లు సేవించడం వల్ల జరిగే అనర్థాల ను గూర్చి వివరించారు. కంజాయ్, డ్రగ్స్ కు బానిసలైన వారిని గుర్తించి వారికి అవగహన కల్పించాలని అందుకు యువత చైతన్యం కలిగించాలని ఆయన సూచించారు. కల్లు కు బానిసలైన వారు నాణ్యమైన కల్లు సేవించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే ల ప్రతి ఇంట్లో యువకుడు వారి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సదస్సులో రుద్రూర్ సీ ఐ కృష్ణ, ఎస్ ఐ సాయన్న ఎక్ససైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments